అభ్యర్థుల కూడికలు.. తీసివేతలు..
ABN , First Publish Date - 2021-04-10T05:11:04+05:30 IST
పోలింగ్ ముగియడంతో అభ్యర్థులు కూడికలు, తీసివే తలు వేస్తున్నారు.
గెలపోటములపై లెక్కలు
నరసాపురం రూరల్, ఏప్రిల్ 8: పోలింగ్ ముగియడంతో అభ్యర్థులు కూడికలు, తీసివే తలు వేస్తున్నారు. తమకు ఎన్ని ఓట్లు వస్తాయన్న దానిపై లెక్కలు వేస్తున్నారు. శుక్రవారం మండలంలోని అభ్యర్థుల నివాసాల్లో ఎక్కడ చూసినా సందడిగానే కనిపించింది. గెలుపు మనదేనంటూ పార్టీ నాయకులు లెక్కలు కట్టి అభ్యర్థులకు చూపించారు. ఇటు జడ్పీటీసీ అభ్యర్థుల్లోనూ ఇదే ఽధీమా నెలకొంది. తమకు సైలెంట్ ఓటింగ్ బాగా పడిందని బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులిద్దరూ నమ్మకంతో ఉన్నారు.