క్రాస్‌ ఓటింగ్‌ భయం..భయం

ABN , First Publish Date - 2021-04-10T05:12:05+05:30 IST

పరిషత్‌ ఎన్నికల టెన్షన్‌.. టెన్షన్‌.. ఇంకా వీడలేదు. పాలకోడేరు మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలకు ఐదు ఏకగ్రీవమ య్యాయి.

క్రాస్‌ ఓటింగ్‌ భయం..భయం

పోలింగ్‌పై టెన్షన్‌..టెన్షన్‌

పాలకోడేరు, ఏప్రిల్‌ 9 : పరిషత్‌ ఎన్నికల టెన్షన్‌.. టెన్షన్‌.. ఇంకా వీడలేదు. పాలకోడేరు మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలకు ఐదు ఏకగ్రీవమ య్యాయి. దీంతో గురువారం 14 ఎంపీటీసీ స్థానాలు, జడ్పీ టీసీకే పోలింగ్‌ జరిగింది. టీడీపీ ఎన్నికలను బహిష్కరించడంతో ఆ ఓటింగ్‌ ఎటువైపు పడిందనే దానిపైనే నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. అయినా ఏ ఒక్కరికీ పల్లె రాజకీయం అంతుచిక్కడం లేదు. ప్రస్తుతం అందరి అభ్యర్థులను క్రాస్‌ ఓటింగ్‌ భయం వెన్నాడుతోంది.ఎందుకంటే టీడీపీ ఓటు ఎటుపడిందోనని ఆందోళనలో ఉన్నారు. అది క్రాస్‌ ఓటింగ్‌ పడితే గెలుపుపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.  

Updated Date - 2021-04-10T05:12:05+05:30 IST