సైకిల్‌ దెబ్బకు.. చెమటలు..

ABN , First Publish Date - 2021-04-10T05:09:00+05:30 IST

టీడీపీ అధిష్ఠానం ఎన్నికలను బహి ష్కరించినా.. నాయకులు మాత్రం అధికార పక్షానికి చెమటలు పట్టిం చారు.

సైకిల్‌ దెబ్బకు.. చెమటలు..

టీడీపీ నాయకుల కొత్తరూటు

ఆకివీడురూరల్,‌ ఏప్రిల్‌ 9 : టీడీపీ అధిష్ఠానం ఎన్నికలను బహి ష్కరించినా.. నాయకులు మాత్రం అధికార పక్షానికి చెమటలు పట్టిం చారు. తాము సీన్‌లో లేము కదా అని ఎన్నికలను వదిలేయలేదు. పోలింగ్‌కు టీడీపీ, జనసేన కొన్ని చోట్ల రహస్య ఒప్పందంతో ముందు నిలిచాయి. ఆకివీడు మండలంలోని పెదకాపవరం, చినకాపవరం, గుమ్ములూరు, కుప్పనపూడి, దుంపగడప గ్రామాల్లో టీడీపీ అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికి జనసేనకు రహస్యంగా మద్దతు ఇచ్చినట్టు సమా చారం. అయిభీమవరంలో సొంతంగా, కోళ్ళపర్రులో జనసేనతో కలిసి టీడీపీ గట్టి పోటీ ఇచ్చింది. మండలంలోని ఆరు చోట్ల నువ్వానేనా అన్నట్టుగా పోరు సాగింది. 

Updated Date - 2021-04-10T05:09:00+05:30 IST