విండీస్దే చివరి టీ20
ABN , First Publish Date - 2022-08-16T12:05:47+05:30 IST
న్యూజిలాండ్తో జరిగిన చివరి టీ20లో వెస్టిండీస్కు ఓదార్పు విజయం దక్కింది.
కింగ్స్టన్: న్యూజిలాండ్తో జరిగిన చివరి టీ20లో వెస్టిండీస్కు ఓదార్పు విజయం దక్కింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (53), బ్రూక్స్ (56 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించారు. దీంతో ఆతిథ్య జట్టు 8 వికెట్ల తేడాతో గెలిచింది. అయితే ఇప్పటికే తొలి రెండు టీ20లను గెలిచిన కివీస్ 2-1తో సిరీస్ దక్కించుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన విలియమ్సన్ సేన 20 ఓవర్లలో 7 వికెట్లకు 145 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ (41) టాప్ స్కోరర్. స్మిత్కు మూడు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో విండీస్ 19 ఓవర్లలో 2 వికెట్లకు 150 పరుగులు చేసి నెగ్గింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా కింగ్, మ్యాన్ ఆఫ్ ద సిరీ్సగా ఫిలిప్స్ నిలిచారు.