పశ్చిమగోదావరి జిల్లాలోని ఓ ఇంట్లో చోరీ
ABN , First Publish Date - 2021-12-13T13:37:11+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడిలోని ఓ ఇంట్లో దుండుగులు చోరీకి తెగబడ్డారు.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడిలోని ఓ ఇంట్లో దుండుగులు చోరీకి తెగబడ్డారు. ఇంటి కుటుంబ సభ్యులు గత రాత్రి వివాహానికి వేరే ఊరు వెళ్లారు. ఇదే సమయంలో ఆగంతకులు ఆ ఇంటి కిటికీ తొలగించి బీరువాలు పగులకొట్టి బంగారం, నగదును చోరీ చేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.