బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన యువకులపై ఫోక్సో కేసు

ABN , First Publish Date - 2021-11-11T16:00:28+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో ఓ బాలికను మాయమాటలు చెప్పి తీసుకువెళ్లిన ఇద్దరు యువకులపై లక్కవరం పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు.

బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన యువకులపై ఫోక్సో కేసు

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో ఓ బాలికను మాయమాటలు చెప్పి తీసుకువెళ్లిన ఇద్దరు యువకులపై లక్కవరం పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. తాత వద్ద ఉంటున్న బాలికను ప్రేమిస్తున్నానంటూ వంశీ అనే యువకుడు వెంటపడి వేధించాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి విజయ్ అనే వ్యక్తి సహకారంతో బాలికను వంశీ ఇంటి నుండి బయటకు తీసుకువెళ్లాడు. బాలిక ఆచూకి తెలియకపోవడంతో తల్లిదండ్రులు ఆమె కోసం గాలించారు. చివరకు బాలిక ఆచూకి కనుగొని ఇంటికి తీసుకువచ్చారు. తల్లిదండ్రులు మందలించగా జరిగిన విషయాన్ని బాలిక తెలిపింది. ఈ ఘటనపై తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. 

Updated Date - 2021-11-11T16:00:28+05:30 IST