ఆలయాల్లో మాస శివరాత్రి పూజలు
ABN , First Publish Date - 2021-04-11T05:18:52+05:30 IST
మాసశివరాత్రి సందర్భంగా క్షీరా రామలింగే శ్వరస్వామి ఆలయంలో శనివారం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు.
పాలకొల్లు అర్బన్, ఏప్రిల్ 10 :మాసశివరాత్రి సందర్భంగా క్షీరా రామలింగే శ్వరస్వామి ఆలయంలో శనివారం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. ఆలయ ఈవో యాళ్ళ సూర్యనారాయణ, పాలక మండలి చైర్మన్ కోరాడ శ్రీనివాసరావు పర్యవేక్షించారు. సాయంత్రం స్వామివారికి లక్ష ముత్యాల అలంకరణ చేశారు.కార్యక్రమంలో అర్చకుడు ఎం.మల్లిఖార్జునరావు, కిష్టప్ప, పూర్ణయ్య, అనిల్ కుమార్ శర్మ, వెంకన్న,సూరిబాబు పాల్గొన్నారు.
భీమవరంలో సోమేశ్వరుడికి...
భీమవరంటౌన్, ఏప్రిల్ 10 : గునుపూడిలోని పంచారామ క్షేత్రమైన సోమే శ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. ఆలయ అర్చకులు కందుకూరి సోంబాబు, చెరుకూరి రామకృష్ణ ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా స్వామికి ప్రత్యేకంగా అలంకారం చేశారు. ఆలయ ఈవో అరుణకుమార్ పర్యవేక్షించారు. ఇండియన్ బ్యాంకు రోడ్డులోని పార్వతీ సమేత సోమేశ్వర స్వామి, భీమేశ్వరస్వామి, శ్రీరాంపురంలోని రామలింగేశ్వర స్వామి ఆలయాల్లోనూ పంచామృతాలతో అభిషేకాలు చేశారు.
జుత్తిగలో మృత్యుంజయ అభిషేకం...
పెనుమంట్ర, ఏప్రిల్ 10 : జుత్తిగ గ్రామంలో ఉమావాసుకీ రవి సోమేశ్వర స్వామికి మృత్యుంజయ అభిషేకం చేశారు. వేద పండితుడు వేమూరి ఫణీంద్ర శర్మ ఆధ్వర్యంలో ఆలయ అర్చకుడు పవన్ కుమార్ శర్మ అభిషేకా లు చేశారు.శనివారం సందర్భంగా శనీశ్వరుడికి తైలాభిషేకాలు జరిగాయి. సర్పంచ్ వీర్రెడ్డి, కొవ్వూరి సూర్య సత్యనారాయణ రెడ్డి పూజలు చేశారు.