West godavari జిల్లాలో బంద్ విఫలం చేసేందుకు పోలీసుల చర్యలు
ABN , First Publish Date - 2021-10-20T13:34:39+05:30 IST
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ దాడికి నిరసనగా టీడీపీ చేపట్టిన బంద్ను విఫలం చేసేందుకు జిల్లా పోలీసులు చర్యలు చేపట్టారు.
ఏలూరు: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ దాడికి నిరసనగా టీడీపీ చేపట్టిన బంద్ను విఫలం చేసేందుకు జిల్లా పోలీసులు చర్యలు చేపట్టారు. ఎనిమిది ఆర్టీసీ డిపోల వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించారు. ఏలూరులో ఆర్టీసీ బస్సులు పాక్షికంగా తిరుగుతున్నాయి. పోలీసులు బస్సులలో రక్షణగా వెళుతున్నారు. బంద్ నేపథ్యంలో హోటల్స్ మూతపడ్డాయి.