రెండు బైక్లను ఢీకొన్న కారు
ABN , First Publish Date - 2021-03-01T17:10:29+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లాలో కొవ్వూరు బుద్దుడు బొమ్మ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో కొవ్వూరు బుద్దుడు బొమ్మ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకువచ్చిన ఓ కారు...రెండు బైక్లను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలవగా...వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్కూలుకి వెళ్తున్న చిన్నారులకు గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.