నిడదవోలు చైర్మన్‌ గిరీ ఏ పార్టీకో..

ABN , First Publish Date - 2021-02-25T05:15:46+05:30 IST

పురపాలక సంఘ పోరులో నిడదవోలు పురపాలక సంఘ చైర్మన్‌ సీటును ఏ పార్టీ స్వంతం చేసుకుంటుంది అనేది ఆసక్తిగా మారింది.

నిడదవోలు చైర్మన్‌ గిరీ ఏ పార్టీకో..

నిడదవోలు, ఫిబ్రవరి 24 : పురపాలక సంఘ పోరులో నిడదవోలు పురపాలక సంఘ చైర్మన్‌ సీటును ఏ పార్టీ స్వంతం చేసుకుంటుంది అనేది ఆసక్తిగా మారింది. తెలుగుదేశం, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. తెలుగుదేశం పార్టీ నుండి ఒకరు చైర్మన్‌ అభ్యర్ధిగా బరిలో ఉండగా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గతంగా ఇద్దరు ప్రధాన వ్యక్తుల మధ్య పోటి నెలకొంది. కౌన్సిలర్లుగా ఈ ఇద్దరూ వేరు వేరు వార్డులలో పోటీ చేస్తున్నప్పటికి వారి దృష్టంతా చైర్మన్‌ సీటుపైనే ఉంది. పార్టీ నాయకత్వం గెలిచిన తరువాత తుది నిర్ణయం తీసుకునేందుకు నిర్ణయించింది. అయితే గెలిచిన తరువాత చైర్మన్‌ సీటు పోటీ ఇద్దరు వ్యక్తుల మధ్యే ఉంటుందా లేక మూడవ వ్యక్తి తెరమీదకు వస్తాడా అనేది ఆ పార్టీలోనే ఆసక్తికరంగా చర్చ సాగుతోంది.



Updated Date - 2021-02-25T05:15:46+05:30 IST