నిలిచిన విద్యుత్ సరఫరా...భయంగా గడిపిన కోవిడ్ రోగులు

ABN , First Publish Date - 2021-05-12T12:59:38+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో అర్ధరాత్రి విద్యుత్ సరాఫరా నిలిచిపోయింది.

నిలిచిన విద్యుత్ సరఫరా...భయంగా గడిపిన కోవిడ్ రోగులు

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో అర్ధరాత్రి విద్యుత్ సరాఫరా నిలిచిపోయింది. అటు జనరేటర్ పనిచేయకపోవడంతో ఆస్పత్రి మొత్తం అంధకారంలో ఉండిపోయింది. విద్యుత్ నిలిచిపోవడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 70 మంది కోవిడ్ రోగులు భయంతో గడిపారు. విషయం తెలిసిన ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు హుటాహుటిన అర్ధరాత్రి ఆసుపత్రికి చేరుకొని డీజిల్ రప్పించి జనరేటర్‌తో విద్యుత్‌ను పునరిద్దరించారు. కోవిడ్ రోగుల పట్ల నిర్లక్షం వహిస్తే సహించనని ప్రభుత్వాన్ని నిమ్మల హెచ్చరించారు. 

Updated Date - 2021-05-12T12:59:38+05:30 IST