ప.గో. జిల్లా: మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య!
ABN , First Publish Date - 2022-01-24T17:17:45+05:30 IST
పెంటపాడు మండలం, ఆలంపురం గ్రామంలో మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
ప.గో. జిల్లా: పెంటపాడు మండలం, ఆలంపురం గ్రామంలో మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం మధ్యాహ్నం దేవేళ్ళ మేరీ ప్రసన్న కుమారి(30) అనే మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే పోలీసు కేసు కాకుండా రహస్యంగా అంత్యక్రియలు చేయాలని బంధువులు భావించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సమీక్షించారు. కొందరి వేధింపులతో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఆత్మహత్యకు ముందు తన చావుకి ఎవరూ కారణం కాదంటూ ఆడియో రికార్డింగ్ అభ్యమైంది. మృతురాలి చివరి మాటలు అందరినీ కంటతడి పెట్టించింది. ప్రసన్న కుమారి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.