మేజర్‌లో.. గెలుపెవరిదో...?

ABN , First Publish Date - 2021-04-11T05:17:27+05:30 IST

పరిషత్‌ ఎన్నికల్లో ఈ సారి మేజర్‌ పంచాయతీల్లో ఎవరి ఆదిపత్యం కొనసాగుతుందా? అన్నది సస్పెన్స్‌గా మారింది.

మేజర్‌లో.. గెలుపెవరిదో...?

మేజర్‌ పంచాయతీల్లో ఓటింగ్‌పై లెక్కలు

నరసాపురం, ఏప్రిల్‌ 10 : పరిషత్‌ ఎన్నికల్లో ఈ సారి మేజర్‌ పంచాయతీల్లో ఎవరి ఆదిపత్యం కొనసాగుతుందా? అన్నది సస్పెన్స్‌గా మారింది. గత పంచాయతీ ఎన్నికల్లో లక్ష్మణేశ్వరం, రుస్తుం బాద, సరిపల్లి, తూర్పుతాళ్ళు, వేములదీవి గ్రామాల్లో జనసేన, టీడీపీల ఆదిపత్యం కొనసాగింది. కొప్పర్రు, సీతారాంపురం, ఎల్‌బీ చర్ల పంచాయతీల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. ఈ సారి ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని వైసీపీ, తిరిగి తమ ఖాతాలోనే ఆ పంచాయతీలు చేరుతాయని జనసేన, టీడీపీలు ధీమాతో ఉన్నాయి. ఆయా పల్లెల్లో  పోలింగ్‌ సరళి ఆధారంగా ఏఏ స్థానాల్లో తమకు విజయం వస్తుందన్న దానిపై ఆ పార్టీ ముఖ్య నేతలు కూడికలు, తీసివేతలు కడుతున్నారు.  ఆయా గ్రామాల్లో ఓట్ల శాతమే జడ్పీటీసీ ఫలితంపై ప్రభావం చూపుతుందని అంటున్నారు..

Updated Date - 2021-04-11T05:17:27+05:30 IST