పార్టీని బలోపేతం చేయాలి : దుర్గేష్‌

ABN , First Publish Date - 2021-03-08T04:15:48+05:30 IST

గ్రామస్థాయి నుంచి జనసేన పార్టీని బలోపేతం చేయాలని జనసేన పార్టీ రాజమండ్రి పార్లమెంట్‌ ఇన్‌ ఛార్జి కందుల దుర్గేష్‌ అన్నారు.

పార్టీని బలోపేతం చేయాలి : దుర్గేష్‌

ఉండ్రాజవరం, మార్చి 7 : గ్రామస్థాయి నుంచి జనసేన పార్టీని బలోపేతం చేయాలని జనసేన పార్టీ రాజమండ్రి పార్లమెంట్‌ ఇన్‌ ఛార్జి కందుల దుర్గేష్‌ అన్నారు. నిడదవోలు నియోజకవర్గంలో జన సేన పార్టీ తరపున ఎన్నికైన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యు లకు జనసేన నాయకులు ఆదివారం ఉండ్రాజవరంలో ఆత్మీయ సత్కారం నిర్వహించారు.పంచాయతీ ఎన్నికల్లో పార్టీ తరపున ఎన్ని కైన నాయకులు సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. విశాఖ పట్నం పార్లమెంట్‌ ఇన్‌ఛార్జి మేడా గురుదత్‌ప్రసాద్‌, తాడేపల్లిగూడెం ఇన్‌ఛార్జి బొలిశెట్టి శ్రీనివాస్‌, ప్రియసౌజన్య,రామకృష్ణ పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-08T04:15:48+05:30 IST