ఆలయాల్లో గోపూజలు
ABN , First Publish Date - 2021-01-16T05:47:38+05:30 IST
కనుమ పండుగ రోజు పట్టణంలోని క్షీరా రామలింగేశ్వరస్వామి, అష్టభుజ లక్ష్మీనారాయణస్వామి ఆలయంలో గో పూజలు వైభవంగా నిర్వహించారు.
పాలకొల్లు అర్బన్, జనవరి 15 : కనుమ పండుగ రోజు పట్టణంలోని క్షీరా రామలింగేశ్వరస్వామి, అష్టభుజ లక్ష్మీనారాయణస్వామి ఆలయంలో గో పూజలు వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు మల్లికార్జున శర్మ, కిట్టప్ప, పూర్ణయ్య, అనిల్, అభిషేక పండితులు భమిడిపాటి వెంకన్న, మద్దూరి సూరిబాబు, భక్తులు పాల్గొన్నారు.
భీమవరం టౌన్ : మావుళ్లమ్మ ఆలయం వద్ద గోపూజ నిర్వహించి గోపూజ గొప్పతనంపై ప్రవచనం చేశారు. గునుపూడి సోమేశ్వరస్వామి, భీమేశ్వరస్వామి, రామలింగేశ్వరస్వామి ఆలయాల్లో గోపూజ నిర్వహించారు. ఆలయ ఈవో అరుణ్ కుమార్, తోట శ్రీనివాసరావు, డీవీ.కృష్ణంరాజు ఆధ్వర్యంలో గోపూజలు నిర్వహించారు.
కాళ్ళ : కాళ్ళకూరు వేంకటేశ్వరస్వామి ఆలయంలో కనుమ పండుగ పర్వదినం పురస్కరించుకొని శుక్రవారం గోపూజ నిర్వహించారు. అనంతరం విద్యార్ధులకు క్విజ్ నిర్వహించారు. భక్తులు, చిన్నారులు పాల్గొన్నారు. ఆలయ ఈవో ముదునూరి సూర్యనారాయణరాజు, సిబ్బంది ఏర్పాటు చేశారు.
ఫ ఉండి : ఉండిలోని ఆలయంలో గోమాతకు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో గుండాబత్తుల సుబ్బారావు, శేషాద్రి శ్రీనివాసరావు, విద్యా సాగర్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఎన్ఆర్పిఅగ్రహారంలోని విశ్వేశ్వరస్వామి ఆలయంలో గోమాత పూజలను నిర్వహించారు.
పెనుగొండ: వాసవి శాంతి క్షేత్రంలో గోపూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. వాసవి హోమం, మరకత వాసవి మూర్తికి విశేష అలంకరణ చేశారు. చుట్టు పక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధికసంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.