నేటి నుంచి ద్వారకా తిరుమలలో భగవద్గీత పారాయణం

ABN , First Publish Date - 2021-11-27T13:39:46+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో ఈరోజు నుంచి 14 వరకు భగవద్గీత పారాయణం జరుగనుంది.

నేటి నుంచి ద్వారకా తిరుమలలో భగవద్గీత పారాయణం

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో ఈరోజు నుంచి 14 వరకు భగవద్గీత పారాయణం జరుగనుంది. శ్రీవారి కళాతోరణంలో సాయంత్రం 6 గంటల నుంచి 7:30 వరకు పారాయణం నిర్వహించనున్నారు. 18 రోజుల పాటు రోజుకొక అధ్యాయం పారాయణo చేయనున్నారు. టీటీడీ, ధర్మ ప్రచార పరిషత్, ద్వారకా తిరుమల దేవస్థానo సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు. 

Updated Date - 2021-11-27T13:39:46+05:30 IST