రేపటి నుంచి ద్వారకా తిరుమలలో అశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2021-10-14T13:31:12+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో రేపటి నుండి ఈ నెల 22 వరకు అశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.

రేపటి నుంచి ద్వారకా తిరుమలలో అశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో రేపటి నుండి ఈ నెల 22 వరకు అశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. రేపు ఉదయం స్వామీ అమ్మవార్లను  పెళ్లి కొడుకు, పెళ్లి కూతుర్లుగా అలంకరించనున్నారు. 16 న ధ్వజారోహణ, 18 న ఎదుర్కొలు, 19 న స్వామివారి కల్యాణం, 20 న రథోత్సవం, 22 న స్వామివారి పవళింపుసేవతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.  కరోనా నిబంధనలను పాటిస్తూ బ్రహ్మోత్సవాలు  జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల సమయంలో ఆలయంలో ఆర్జిత సేవలు, ఆర్జిత కల్యాణాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో జి వి సుబ్బారెడ్డి తెలిపారు. 

Updated Date - 2021-10-14T13:31:12+05:30 IST