ప.గో. జిల్లాలో నేడు చంద్రబాబు పర్యటన

ABN , First Publish Date - 2022-03-14T16:31:01+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.

ప.గో. జిల్లాలో నేడు చంద్రబాబు పర్యటన

ప.గో.జిల్లా: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. జంగారెడ్డిగూడెంలో నాటుసారా మృతులను పరామర్శించనున్నారు. నాటుసారా తాగి నాలుగు రోజుల వ్యవధిలో 18 మంది మృతి చెందడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. కల్తీసారా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని చంద్రబాబు అన్నారు. కల్తీసారా కారణంగా అనేకమంది చనిపోతున్నారని, రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా?, ప్రాణాలు పోతున్నా స్పందించదా? అంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.


మరోవైపు చంద్రబాబు పర్యటను విఫలం చేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారు. నిన్న రాత్రి వైసీపీ వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి చంద్రబాబును కలవద్దని ఒత్తిడి చేశారు. ఏలూరు కలక్టరేట్‌కు వెళ్లాలని అక్కడ రూ. 10 లక్షలు ఇస్తారని ఆశపెట్టారు. అయితే తాము చంద్రబాబును కలిసే తీరుతామని బాధిత కుటుంబాలు స్పష్టం చేశాయి.

Updated Date - 2022-03-14T16:31:01+05:30 IST