ఫేస్ బుక్ ప్రేమ.. పెళ్లిచేసుకుని వదిలేసిన భర్త.. ట్రాన్స్ జెండర్ ఏంచేసిందంటే..
ABN , First Publish Date - 2022-01-02T21:34:07+05:30 IST
ప.గో.జిల్లా: ఏలూరులో ఓ ట్రాన్స్ జెండర్ భూమి ఆందోళనకు దిగింది.
ప.గో.జిల్లా: ఏలూరులో భూమి అనే ట్రాన్స్ జెండర్ ఆందోళనకు దిగింది. తనపై దాడి చేసిన భర్తపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఏలూరుకు చెందిన తారక మహేష్ హైదరాబాద్లో ఫేస్ బుక్ ద్వారా పరిచయమై తనను వివాహం చేసుకున్నాడని తెలిపింది. తర్వాత తమ మధ్య గొడవలు జరగడంతో హైదరాబాద్లో మూడు కేసులు పెట్టానని, అయితే రాజీ కుదుర్చుకుందామని పిలిపించి దాడికి పాల్పడ్డారని ట్రాన్స్ జెండర్ ఆరోపించింది. ఈ ఘటనపై ఏలూరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. తనలా మరొకరు మోసపోవద్దని ఆవేదన వ్యక్తం చేసింది.