Pawan Kalyan Bhimavaram నుంచే పోటీ చేస్తారు: కొటికలపూడి గోవిందరావు

ABN , First Publish Date - 2022-07-15T19:07:43+05:30 IST

రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భీమవరం నుంచే పోటీ చేస్తారని ఆ పార్టీ నేత వెల్లడించారు.

Pawan Kalyan Bhimavaram నుంచే పోటీ చేస్తారు: కొటికలపూడి గోవిందరావు

పశ్చిమగోదావరి (West Godavari) జిల్లా: రాబోయే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భీమవరం (Bhimavaram) నుంచే పోటీ చేస్తారని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు (Govindarao) అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ భీమవరం నుంచే రాష్ట్ర రాజకీయాలకు అడుగులు పడనున్నాయన్నారు. పవన్ తరపున నియోజకవర్గ ప్రజలకు తాము అందుబాటులో ఉంటామన్నారు. 2024 ఎన్నికల్లో జనసేన కీలక పాత్ర పోషించనుందని, ఈ నెల 17న పవన్ కళ్యాణ్ భీమవరం జనవాణి కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఆనంద పంక్షన్ హాల్‌లో జనవాణి కార్యక్రమం జరగనుందని, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకూ అర్జీలు స్వయంగా స్వీకరిస్తారని చెప్పారు. ప్రజలు పవన్ కళ్యాణ్‌ను స్వయంగా కలసి వారి సమస్యలను వివరించవచ్చునని కొటికలపూడి గోవిందరావు చెప్పారు.

Updated Date - 2022-07-15T19:07:43+05:30 IST