ప.గో. జిల్లా: పదిమంది పోలీసులకు కరోనా
ABN , First Publish Date - 2021-04-08T17:00:11+05:30 IST
తమిళనాడు ఎన్నికల విధులకు వెళ్లిన పోలీసు సిబ్బందిలో 10మందికి కరోనా సోకింది.
ప.గో. జిల్లా: పశ్చిమగోదావరి జిల్లా నుంచి తమిళనాడు ఎన్నికల విధులకు వెళ్లిన పోలీసు సిబ్బందిలో 10మందికి కరోనా సోకింది. 50 మంది పోలీసులు అంతా ఒకే బస్సులో ప్రయాణం చేశారు. వారిలో 6గురికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మిగిలిన సిబ్బంది ఎన్నికల విధులకు హాజరవుతున్నారు. అలాగే పోలవరంలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్నఓ కానిస్టేబుల్కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇటీవల తమిళనాడు ఎన్నికలకు 367 మంది పోలీసులు వెళ్ళారు.