మోటార్ సైకిల్ ఢీకొని వివాహిత మృతి
ABN , First Publish Date - 2021-01-14T05:09:23+05:30 IST
రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతిచెందింది.
ఆకివీడు రూరల్ జనవరి 13 : రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతిచెందింది. ఆకివీడు జడ్పీ పాఠశాల సమీపంలో సీట్ కవర్ల షాపు నడుపుతున్న దివ్యాంగుడైన తన భర్త చిన అప్పారావుకు భోజనం క్యారియర్ ఇచ్చేందుకు జొరిగే విజయలక్ష్మి (36) బయలుదేరింది.జడ్పీ పాఠశాల సమీపంలో మోటార్ సైకిల్ ఢీకొని తల రోడ్డుకు తగిలింది. తీవ్రగాయాలపాలైన ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలిం చగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధృవీకరించారు. ఆమెకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇక నాకు.. పిల్లలకు దిక్కెవరంటూ భార్య మృతదేహం వద్ద భర్త రోదన చూపరులను కంట తడి పెట్టించింది. హెచ్సి భూషణం కేసు నమోదు చేశారు.