పశ్చిమగోదావరి జిల్లాలో మరో ఆరు కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-05-30T15:56:14+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లాలో మరో ఆరు కరోనా కేసులు
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో తాజాగా ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 110కి చేరింది. పెదవేగి మండలం పినకడిమి, భీమవరంలో ఒక్కో కేసు, ఉండి మండలం చెరకువాడ, పెనుగొండలో రెండు కేసుల చొప్పున నమోదు అయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో 52 మంది చికిత్స పొందుతుండగా, ఆస్పత్రి నుంచి 58 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 34,692 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 31,272 మందికి నెగిటివ్ అని తేలింది. అలాగే ప్రస్తుతం క్వారంటైన్ సెంటర్లలో 1553 మంది ఉన్నారు.