పశ్చిమగోదావరి జిల్లాలో మరో 110 కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-07-11T13:50:58+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లాలో మరో 110 కరోనా కేసులు
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో మరో 110 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,463కు చేరింది. కొత్తగా ఏలూరులో 43 కేసులు నమోదు అయ్యాయి. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. వారికి పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.