చెట్టును ఢీకొట్టి కాలువలోకి దూసుకెళ్లిన కారు..డ్రైవర్ మృతి

ABN , First Publish Date - 2022-09-05T16:09:57+05:30 IST

భీమవరం జువ్వలపాలెం కారు బీభత్సం సృష్టిచింది. రోడ్డు అడ్డ వంతెన వద్ద అతి వేగంతో వెళుతూ రోడ్డుపక్కన చెట్టును ఢీకొట్టి పంట కాలువలోకి

చెట్టును ఢీకొట్టి కాలువలోకి దూసుకెళ్లిన కారు..డ్రైవర్ మృతి

West Godavari: భీమవరం(Bhimavaram) జువ్వలపాలెం కారు బీభత్సం సృష్టిచింది. రోడ్డు అడ్డ వంతెన వద్ద అతి వేగంతో వెళుతూ రోడ్డుపక్కన చెట్టును ఢీకొట్టి పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారు మొత్తం నుజ్జునుజ్జు కావడంతో కారులో ఉన్న డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా..మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కాలువలోకి దూసుకెళ్లిన కారు బయటికి తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Updated Date - 2022-09-05T16:09:57+05:30 IST