జంగారెడ్డిగూడెంలో నాటుసారా రక్కసికి మరొకరు బలి

ABN , First Publish Date - 2022-03-16T13:30:08+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో నాటుసారా రక్కసికి మరొకరు బలి అయ్యారు.

జంగారెడ్డిగూడెంలో నాటుసారా రక్కసికి మరొకరు బలి

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో నాటుసారా రక్కసికి మరొకరు బలి అయ్యారు. నిన్న ఉదయం మాధవరపు వరదరాజులు (38)అనే వ్యక్తి  నాటుసారా తాగాడు. కొద్దిసేపటికే అతడి ఆరోగ్యం విషమించడంతో వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కాగా... పరిస్థితి విషమంగా ఉండడంతో గుంటూరు తీసుకువెళ్ళాలని అక్కడి వైద్యులు సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు గుంటూరు ఆసుపత్రికి తరలించగా... చికిత్స పొందుతూ వరదరాజులు మృతి చెందాడు. వారం రోజుల్లో నాటు సారాకు బలైన వారి సంఖ్య 26కు చేరింది. వరదరాజులు మృతిపై మొదట కేసు నమోదు చేయడానికి  పోలీసులు నిరాకరించారు. అయితే కొద్దిసేపటి తరువాత మృతుని బంధువులను పిలిపించి మరీ పోలీసులు కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. 

Updated Date - 2022-03-16T13:30:08+05:30 IST