భార్యను హతమార్చి... ఆపై భర్త ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2022-03-11T19:24:35+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా గణపవరం మండలం చిన రామచంద్రపురం గ్రామంలో దారుణం జరిగింది.

భార్యను హతమార్చి... ఆపై భర్త ఆత్మహత్యాయత్నం

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా గణపవరం మండలం చిన రామచంద్రపురం గ్రామంలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్య గొంతు కోసి హతమార్చిన భర్త... ఆపై తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భార్య జ్యోతిని భర్త చిగురుకోట శ్రీనివాస్ చాకుతో గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం శ్రీనివాస్ గొంతు కోసుకుని బలవన్మరణానికి యత్నించాడు. వెంటనే స్థానికులు శ్రీనివాస్‌ను మెరుగైన వైద్యం నిమిత్తం విజయవాడ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు మూగ వ్యక్తిగా తెలుస్తోంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. బిల్డింగ్ ఐరన్ వర్క్ పని చేసే భార్యపై అనుమానంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్టు సమాచారం. ఓ వైపు తల్లి చనిపోయి... మరోవైపు తండ్రి ఆస్పత్రిలో చేరడంతో పిల్లల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-03-11T19:24:35+05:30 IST