Eluru: ఆగి ఉన్న లారీని ఢీకొన్న మరో లారీ
ABN , First Publish Date - 2022-03-03T14:35:30+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు గామన్ బ్రిడ్జిపై ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు గామన్ బ్రిడ్జిపై ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ లారీలో చిక్కుకుపోయారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని డ్రైవర్, క్లీనర్లను బయటకు తీసి రక్షించారు. వారికి తీవ్ర గాయాలు అవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.