పశ్చిమగోదావరి జిల్లాలో వృద్ధుడు సజీవదహనం

ABN , First Publish Date - 2022-02-28T17:55:13+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం ప్రత్తిపాడులో దారుణం జరిగింది. గుడారంలో మంటలు చెలరేగి పల్లి రామకృష్ణ(69) అనే వృద్ధుడు సజీవదహనం అయ్యాడు.

పశ్చిమగోదావరి జిల్లాలో వృద్ధుడు సజీవదహనం

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం ప్రత్తిపాడులో దారుణం జరిగింది. గుడారంలో మంటలు చెలరేగి పల్లి రామకృష్ణ(69) అనే వృద్ధుడు సజీవదహనం అయ్యాడు. వృద్ధుడు అంగవైకల్యం వలన భిక్షాటన చేస్తూ వంతెన మెట్ల క్రింద గుడారం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నాడు. అంగవైకల్యం వల్ల మంటలు వ్యాపించినా కూడా బయటకు రాలేని పరిస్థితిలో వృద్ధుడు లోపలే ఉండిపోయిన వైనం ఆవేదనకు గురిచేస్తోంది. జెట్ కాయిల్ వలన మంటలు చెలరేగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-02-28T17:55:13+05:30 IST