AP: కాలువలోకి దూసుకెళ్లిన బైక్...వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-12-03T13:31:32+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు తూర్పులాకుల దగ్గర శుక్రవారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి చెందారు.

AP: కాలువలోకి దూసుకెళ్లిన బైక్...వ్యక్తి మృతి

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు తూర్పులాకుల దగ్గర శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఓ బైక్ అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని ఏలూరు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-12-03T13:31:32+05:30 IST