బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు...ఒకరు మృతి

ABN , First Publish Date - 2021-11-30T17:59:42+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు రోడ్ కం రైల్వే బ్రిడ్జి మీదుగా ద్విచక్ర వాహనంపై వస్తున్న వృద్ధ దంపతులను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.

బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు...ఒకరు మృతి

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా  కొవ్వూరు రోడ్ కం రైల్వే బ్రిడ్జి మీదుగా ద్విచక్ర వాహనంపై వస్తున్న వృద్ధ  దంపతులను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్య చావా నాగమణి (59) మృతి చెందగా, భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వ్యక్తిని రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దంపతులు అరికరేవుల గ్రామవాసులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-11-30T17:59:42+05:30 IST