కాంట్రాక్టు బిల్లుల చెల్లింపులో సొంత పార్టీ నేతకే షాకిచ్చిన సర్పంచ్

ABN , First Publish Date - 2022-04-22T18:20:30+05:30 IST

కాంట్రాక్టు బిల్లులు చెల్లింపులో సొంత పార్టీ నేతకే వైసీపీ సర్పంచ్ షాకిచ్చాడు.

కాంట్రాక్టు బిల్లుల చెల్లింపులో సొంత పార్టీ నేతకే షాకిచ్చిన సర్పంచ్

పశ్చిమగోదావరి: కాంట్రాక్టు బిల్లులు చెల్లింపులో సొంత పార్టీ నేతకే వైసీపీ సర్పంచ్ షాకిచ్చాడు. పశ్చిమగోదావరి పెనుమంట్ర మండలం మల్లిపూడిలో రూ.19 లక్షలతో సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్ర భవనాలను వైసీపీ కాంట్రాక్టర్లు  నిర్మించారు. అయితే ఆ బిల్లులకు సంతకాలు పెట్టాలంటే  లక్ష 70 వేలు ఇవ్వాలని కాంట్రాక్టర్‌కు  సర్పంచ్ ఫోన్ చేసి డిమాండ్ చేశారు. కాంట్రాక్టుర్లు, సర్పంచ్ ఇద్దరూ కూడా అధికారపార్టీ వారే. ప్రస్తుతం సర్పంచ్,  కాంట్రాక్టర్ మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైసీపీ నేతల తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో వాస్తవమేనని గుత్తేదారుడు గోపి తెలిపారు. 

Updated Date - 2022-04-22T18:20:30+05:30 IST