కారు ఢీకొని యువకుడి మృతి
ABN , First Publish Date - 2021-01-16T05:50:46+05:30 IST
రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతిచెందాడు.
చింతలపూడి, జనవరి 15 : రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతిచెందాడు. చింతలపూడి మండలం చింతకాయల కొత్తగూడెంకు చెందిన మాతంగి నవీన్ (21) మరో ఇద్దరి స్నేహితులతో కలిసి మోటార్ సైకిల్పై వెళుతుండగా కారు ఢీకొంది. ఈ సంఘటనలో నవీన్ అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇరువురు గాయా లపాలయ్యారు. వీరిని మెరుగైన చికిత్సకు ఏలూరు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.