లారీ ఢీకొని ఒకరి మృతి.. మరొకరికి తీవ్రగాయాలు
ABN , First Publish Date - 2021-01-14T05:08:34+05:30 IST
పండగరోజు విషాదం చోటుచేసుకుంది.
నిడదవోలు, జనవరి 13 : పండగరోజు విషాదం చోటుచేసుకుంది. సమిశ్రగూ డెం వంతెన వద్ద బుధవారం సాయంత్రం నిడదవోలు నుంచి నరసాపురం రోడ్డు లోకి మోటార్ సైకిల్ను అదే దారిలో వచ్చిన క్వారీ లారీ ఢీకొట్టింది. దీంతో మోటార్ సైకిల్ వెళుతున్న ఇద్దరి యువకుల్లో ఒకరు మృతిచెందగా.. మరొకరు తీవ్ర గాయా లపాలయ్యారు. మోటార్ సైకిల్పై వెళుతున్న ఇద్దరు కాల్దరి గ్రామానికి చెందిన వారని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.