తాడేపల్లిగూడెంలో అదృశ్యమైన రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి హత్య
ABN , First Publish Date - 2021-02-27T17:54:44+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో అదృశ్యం అయిన రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యారు.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో అదృశ్యం అయిన రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యారు. ఈ నెల 16న రామచంద్రారెడ్డి అనే రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి అదృశ్యమయ్యారు. నమ్మించి తమతో తీసుకువెళ్లి ముగ్గురు నిందితులు రామచంద్రారెడ్డిని హత్య చేశారు. హత్య చేసిన తరువాత నిందితులు హతుని శరీరంపై ఉన్న నగలు దోచుకున్నారు. పీకకు గుడ్డ చుట్టి హత్య చేసిన నిందితులు... మృతదేహాన్ని ఏలూరులో పడేసి పరారయ్యారు. అదృశ్యం కేసు విచారిస్తుండగా హత్య ఉందంతం వెలుగులోకి వచ్చింది. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రామచంద్రారెడ్డి అప్పులు ఇచ్చి, వేధిస్తుండటం వల్లనే హత్య చేసినట్లు నిందితులు పోలీసులకు వెల్లడించారు.