జగన్నాథపురం లక్ష్మీనరసింహాస్వామి కళ్యాణోత్సవం ప్రారంభం
ABN , First Publish Date - 2021-02-25T17:35:15+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా ఐ.ఎస్.జగన్నాధపురం లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం గురువారం ఘనంగా ప్రారంభమైంది.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఐ.ఎస్.జగన్నాధపురం లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఉత్సవంలో భాగంగా స్వామి, అమ్మవార్లకు గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పట్టువస్త్రాలు సమర్పించారు. సుందరగిరి పర్వతం దిగువున ప్రత్యేక మండపంపై కళ్యాణ వేడుకను నిర్వహించారు. స్వామి కళ్యాణాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకున్నారు.