భీమడోలు, పూళ్ళలో నమోదు కాని వింత వ్యాధి కేసులు
ABN , First Publish Date - 2021-01-21T15:26:18+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు, పూళ్ళలో కొత్తగా వింత వ్యాధి కేసులు నమోదు కాలేదు.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు, పూళ్ళలో కొత్తగా వింత వ్యాధి కేసులు నమోదు కాలేదు. ఇప్పటి వరకు మొత్తం 34 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. పూళ్ళలో 28 మందికి, భీమడోలులో ఆరుగురికి వింత వ్యాధి సోకింది. వారిలో ఇద్దరు మినహా అందరూ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ రోజు కూడా పూళ్ళలో వైద్య శిబిరం కొనసాగుతోంది.