తాగేపల్లిగూడెంలో మహిళ మృతి కేసును చేధించిన పోలీసులు
ABN , First Publish Date - 2020-12-05T15:56:04+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మూడు రోజుల క్రితం జరిగిన మహిళ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు చేధించారు.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మూడు రోజుల క్రితం జరిగిన మహిళ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. అత్త రఫీయున్నీసాను అల్లుడు ఉస్మాన్ భాష హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. అత్త రఫీయున్నీసాను కారులో బయటకు తీసుకువెళ్ళిన అల్లుడు కారులోనే ఆమెను హతమార్చి మృతదేహాన్ని ఇంటి లోపల వేసినట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.