పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం

ABN , First Publish Date - 2020-09-24T14:12:36+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యాదవోలులో విషాదం చోటు చేసుకుంది.

పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యాదవోలులో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ పనులు చేస్తుండగా  విద్యుత్ వైరు తెగిపడింది. దీంతో విద్యుత్ పనులు చేస్తున్న ముగ్గురు కార్మికులకు కరెంట్ షాక్ తగిలింది. వెంటనే స్థానికులు స్పందించి విద్యుత్ వైర్లు లాగడంతో ఇద్దరు ప్రాణాపాయం నుంచి తప్పించుకోగా...ఓ వ్యక్తి కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. మృతుడు చత్తీస్‌ఘఢ్ రాష్ట్రానికి చెందిన కడితి దేవయ్యగా గుర్తించారు. 

Updated Date - 2020-09-24T14:12:36+05:30 IST