అప్పు తీర్చమని అందరిలో అడగాడనే మనస్థాపంతో...
ABN , First Publish Date - 2020-09-21T15:14:53+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం రాళ్ల కుంటలో పురుగులమందు తాగి గంటా నవీన్ మృతి చెందాడు.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం రాళ్ల కుంటలో పురుగులమందు తాగి గంటా నవీన్ మృతి చెందాడు. ఆర్థిక లావాదేవీల విషయంలో నవీన్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. అప్పు తీర్చమని అందరిలో అడిగాడనే మనస్తాపంతో సదరు వ్యక్తి పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన నవీన్ను వెంటనే ఆస్పత్రికి తరలించగా...చికిత్స పొందుతూ మృతి చెందారు.