West Godavari: భార్యభర్తల మధ్య ఘర్షణ..భర్త మృతి

ABN , First Publish Date - 2021-07-19T17:15:50+05:30 IST

జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు భార్యభర్తల మధ్య ఘర్షణ ఒకరి ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన పాలకోడేరు మండలం గొల్లలకోడేరు సంజనా టవర్స్...

West Godavari: భార్యభర్తల మధ్య ఘర్షణ..భర్త మృతి

పశ్చిమ గోదావరి: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు భార్యభర్తల మధ్య ఘర్షణ ఒకరి ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన పాలకోడేరు మండలం గొల్లలకోడేరు సంజనా టవర్స్ సమీపంలో చోటు చేసుకుంది. కొన్ని రోజుల నుంచి వీరిద్దరి మధ్య మనస్పార్ధాలు ఏర్పడి వివాదం జరుగుతూనే ఉంది. అయితే..ఆదివారం అర్ధరాత్రి భర్త బాగా తాగి వచ్చి భార్యను కొడుతుండటంతో వివాదం కాస్త ముదిరింది. భార్య అసహనం కోల్పోయి భర్తను పచ్చడిబండతో తలపై బాదింది. అనంతరం భర్త భార్యపై తలపై బాదాడు. ఇద్దరు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. స్థానికులు ఇద్దరిని వెంటనే ఆస్పత్రి తరలించే క్రమంలోనే భర్త మార్గ మధ్యలో మృతి చెందగా.. భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు రెండ వివాహం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Updated Date - 2021-07-19T17:15:50+05:30 IST