100 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
ABN , First Publish Date - 2021-05-13T18:06:44+05:30 IST
పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం కొత్తూరు శివారులో రైస్ మిల్లు గోడౌన్లో విజిలెన్స్ అధికారుల సోదాలు నిర్వహించారు.
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం కొత్తూరు శివారులో రైస్ మిల్లు గోడౌన్లో విజిలెన్స్ అధికారుల సోదాలు నిర్వహించారు. దాదాపు 100 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచిన గోడౌన్ యజమాని శేషగిరిరావు, రాంబాబు, రవిలపై కేసు నమోదు చేశారు.