శాంతిపూర్లో అమిత్షా భారీ రోడ్షో
ABN , First Publish Date - 2021-04-11T21:10:41+05:30 IST
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నడియా జిల్లాలోని శాంతిపూర్లో..
నడియా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నడియా జిల్లాలోని శాంతిపూర్లో ఆదివారం జరిగిన రోడ్షోలో కేంద్ర హోం మంత్రి అమిత్షా పాల్గొన్నారు. వేలాది మంది మద్దతుదారులు, కార్యకర్తలు బీజేపీ జెండాలతో ఈ రోడ్షోలో పాల్గొన్నారు. ఈనెల 17న జరుగనున్న ఐదో విడత అసెంబ్లీ ఎన్నికల్లో శాంతిపూర్ నియోజకవర్గం కూడా ఉంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా జగన్నాథ్ సర్కార్, టీఎంసీ నుంచి అజాయ్ డే, కాంగ్రెస్ అభ్యర్థిగా రిజు ఘోసల్ పోటీ పడుతున్నారు. ఐదో దశలో భాగంగా 45 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నిక జరుగనుంది. ఆరో విడత 43 స్థానాలకు ఈనెల 22, ఏడో విడత 35 నియోజకవర్గాలకు ఏప్రిల్ 26న, ఎనిమిదవది, చివరిదైన పోలింగ్ ఏప్రిల్ 29న జరుగుతాయి. దీంతో ఓటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. మే 2న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.