పశ్చిమ బెంగాల్ స్థానిక సంస్థల ఎన్నికల రీషెడ్యూల్

ABN , First Publish Date - 2022-01-15T22:50:47+05:30 IST

నాలుగు నగర పాలక సంస్థల ఎన్నికలను పశ్చిమ బెంగాల్ రాష్ట్ర

పశ్చిమ బెంగాల్ స్థానిక సంస్థల ఎన్నికల రీషెడ్యూల్

కోల్‌కతా : నాలుగు నగర పాలక సంస్థల ఎన్నికలను పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) రీషెడ్యూలు చేసింది. అంతకుముందు విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఈ ఎన్నికలు జనవరి 22న జరగవలసి ఉండగా, కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఫిబ్రవరి 12న నిర్వహించనున్నట్లు శనివారం ప్రకటించింది. ఈ ఎన్నికలను నాలుగు నుంచి ఆరు వారాలపాటు వాయిదా వేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఎస్ఈసీని కలకత్తా హైకోర్టు కోరింది. ఈ ఎన్నికలను రీషెడ్యూలు చేయడానికి సమ్మతిస్తూ అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఈసీకి ఓ లేఖను పంపించింది. 


ఎస్ఈసీ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం సిలిగురి, చందేర్ నగోర్, బిధాన్ నగర్, అసన్‌సోల్ నగర పాలక సంస్థల ఎన్నికలు జనవరి 22న జరగవలసి ఉంది. శనివారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఈ ఎన్నికలు ఫిబ్రవరి 12న జరుగుతాయి. 


Updated Date - 2022-01-15T22:50:47+05:30 IST