మెట్రో రైళ్లకు అనుమతివ్వాలని పశ్చిమ బెంగాల్ సీఎస్కు లేఖ
ABN , First Publish Date - 2020-07-01T00:11:15+05:30 IST
పశ్చిమ బెంగాల్ రాజధాని నగరం కోల్కత్తాలో మెట్రో రైళ్లకు పరిమిత సంఖ్యలో...
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్ రాజధాని నగరం కోల్కత్తాలో మెట్రో రైళ్లకు పరిమిత సంఖ్యలో అనుమతివ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రాజీవ్ సిన్హా కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు లేఖ రాశారు. ఈ మేరకు కేంద్రం సడలింపునివ్వాలని ఆయన లేఖలో కోరారు. జూలై 31 వరకూ కేంద్రం ‘అన్లాక్ 2’ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘అన్లాక్ 2’ మార్గదర్శకాల్లో భాగంగా.. దేశవ్యాప్తంగా మెట్రో రైళ్లను జూలై 31 వరకూ కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం విదితమే.