బీజేపీ నాయకురాలు పమేలా డ్రగ్ కేసు విచారణ బాధ్యత పోలీసు డిటెక్టివ్‌కు...

ABN , First Publish Date - 2021-02-23T14:01:07+05:30 IST

పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీ యువ మోర్చా నాయకురాలు పమేలా గోస్వామి డ్రగ్స్ కేసు విచారణ బాధ్యతను...

బీజేపీ నాయకురాలు పమేలా డ్రగ్ కేసు విచారణ బాధ్యత పోలీసు డిటెక్టివ్‌కు...

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీ యువ మోర్చా నాయకురాలు పమేలా గోస్వామి డ్రగ్స్ కేసు విచారణ బాధ్యతను కోల్‌కతా పోలీసు డిటెక్టివ్ విభాగానికి అప్పగించారు. కోల్‌కతాలోని న్యూటౌన్ ప్రాంతంలో పమేలా వద్ద నుంచి కొకైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకొని, ఆమెను అరెస్టు చేశారు. డ్రగ్ కేసులో నిందితురాలైన పమేలాను కోర్టు ఫిబ్రవరి 25వతేదీ వరకు రిమాండుకు పంపించింది. కాగా తనను కేసులో ఇరికించేందుకు కుట్ర పన్నారని పమేలా ఆరోపించారు. పోలీసు డిటెక్టివ్ దర్యాప్తులో డ్రగ్ కేసులో మరిన్ని వాస్తవాలు వెలుగుచూస్తాయని పోలీసులంటున్నారు.

Updated Date - 2021-02-23T14:01:07+05:30 IST