మావుళ్లమ్మ ఉత్సవాలు ప్రారంభం
ABN , First Publish Date - 2021-01-14T05:57:25+05:30 IST
మావుళ్లమ్మ 57వ వార్షిక మహోత్సవాలు బుధవారం ఘనంగా పారంభమయ్యాయి.
భీమవరం టౌన్, జనవరి 13 : మావుళ్లమ్మ 57వ వార్షిక మహోత్సవాలు బుధవారం ఘనంగా పారంభమయ్యాయి. నీరుల్లికూరగాయ పండ్ల వర్తక సంఘం అధ్యక్షుడు రామాయ ణం గోవిందరావు, వెంకటేశ్వరీ దంపతులచే కలశస్థాపన, మ ధ్యాహ్నం హంస వాహనంపై అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించారు. సాయంత్రం సాం స్కృతిక కార్యక్రమాలను మునిసిపల్ కమిషనర్ ఎం.శ్యామల ప్రారంభించారు. ఏటా నెల రోజులపాటు సాగే ఉత్సవాలు కరోనా కారణంగా కుదించారు. ఈ నెల 22న అమ్మవారికి మహా నివేదన ఉంటుంది.