ఖరీదైన ఎముక మజ్జ మార్పిడి ఉచితంగా చేస్తున్నాం
ABN , First Publish Date - 2021-11-27T09:19:01+05:30 IST
దేశంలో ఒక్క తెలంగాణలో మాత్రమే ఉచితంగా పేదల కు బోన్మారో ట్రాన్స్ప్లాంటేషన్ (ఎముక మజ్జ మార్పిడి) సేవలు అం దడం విశేషమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు.
‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ట్వీటర్లో పోస్టు చేసిన మంత్రి హరీశ్
హైదరాబాద్: దేశంలో ఒక్క తెలంగాణలో మాత్రమే ఉచితంగా పేదల కు బోన్మారో ట్రాన్స్ప్లాంటేషన్ (ఎముక మజ్జ మార్పిడి) సేవలు అం దడం విశేషమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. గురువారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన ‘ఎముకమజ్జ మార్పిడి ఫ్రీ’ కథనా న్ని మంత్రి ట్వీటర్లో పోస్టు చేశారు. కార్పోరేట్ ఆస్పత్రుల్లో లభించే వైద్య సౌకర్యాలు సామాన్యులకు ప్రభుత్వ వైద్య రంగంలో అందుతున్నాయని అందులో పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో ప్రభుత్వ వైద్య రంగం అద్భుత ఫలితాలను సాధిస్తోందన్నారు. రూ.10 నుంచి రూ.30 లక్షల వర కు ఖర్చు అయ్యే బోన్మారో ట్రాన్స్ప్లాంటేషన్ను పేదలకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా అందిస్తున్నారని ట్వీటర్లో పేర్కొన్నారు.