‘వలస కార్మికులకు అండగా ఉంటాం’
ABN , First Publish Date - 2020-07-01T10:11:33+05:30 IST
ఒడిశా నుంచి నగరానికి వచ్చి పనిచేసుకుంటున్న వారికి విశ్వ హిందూ పరిషత్ అండగా ఉంటుందని వీహెచ్పీ రాష్ట్ర సహాయక కార్యదర్శి
మియాపూర్, జూన్ 30(ఆంధ్రజ్యోతి): ఒడిశా నుంచి నగరానికి వచ్చి పనిచేసుకుంటున్న వారికి విశ్వ హిందూ పరిషత్ అండగా ఉంటుందని వీహెచ్పీ రాష్ట్ర సహాయక కార్యదర్శి రాజేశ్వర్రెడ్డి అన్నారు. మంగళవారం మియాపూర్లో నిర్వహించిన సమావేశానికి విశ్వహిందూ పరిషత్ ప్రాంత సహ ప్రచార ప్రముఖ్ బాలస్వామి, స్టేట్ కో-ఆర్డినేటర్ శివరాములు, బీజేపీ రాష్ట్ర నాయకుడు జ్ఞానేంద్రప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒడిశా ప్రతినిధులు విశ్వహిందూ పరిషత్ నాయకులను సన్మానించారు.