సినీ, టీవీ రంగాల్లో పనిచేసేవారికి సంక్షేమ పథకాలు

ABN , First Publish Date - 2020-06-02T10:12:36+05:30 IST

సినీ, టీవీ రంగాలపై ఆధారపడి జీవిస్తున్న వారిలో అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించేలా కృషి చేస్తానని మంత్రి

సినీ, టీవీ రంగాల్లో పనిచేసేవారికి సంక్షేమ పథకాలు

చిత్రపురి కాలనీలో ఆస్పత్రి, పాఠశాల నిర్మాణానికి చర్యలు

మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌


హైదరాబాద్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): సినీ, టీవీ రంగాలపై ఆధారపడి జీవిస్తున్న వారిలో అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించేలా కృషి చేస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. సోమవారం మాసబ్‌ట్యాంక్‌లోని కార్యాలయంలో మంత్రిని 24 విభాగాలకు చెందిన వివిధ యూనియన్లకు చెందిన సభ్యులు కలిసి పలు సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. తెల్ల రేషన్‌, హెల్త్‌ కార్డులు మంజూరు చేయాలని, కల్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్లు వర్తింప చేయాలని కోరారు. చిత్రపురి కాలనీలో 4 వేల మంది ఉంటున్నారని, వారి కోసం ఆస్పత్రి, పాఠశాల నిర్మించాలని కోరారు. లాక్‌ డౌన్‌ సమయంలో పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిశ్రమలోని 14 వేల మందికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన మంత్రికి వారు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ.. చిత్రపురి కాలనీలో ఆస్పత్రి, పాఠశాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.


సినీ పరిశ్రమ అభివృద్థి కోసం ప్రభుత్వం బెస్ట్‌ పాలసీని తయారు చేస్తుందని, అందులో సినీ పరిశ్రమలోని కార్మికుల సంక్షేమం అంశాన్ని కూడా పొందుపరుస్తామని వివరించారు. త్వరలోనే సినిమా షూటింగ్‌లకు అనుమతులు ఇస్తామని తెలిపారు. సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా వైద్య ేసవలకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. మంత్రితోపాటు ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎగ్జ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కిషోర్‌బాబు కూడా ఉన్నారు. మంత్రిని కలిసిన వారిలో తెలుగు ఫిలిం ఇండస్ర్టీ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు కోమర వెంకటేష్‌, ప్రధాన కార్యదర్శి పీఎ్‌సఎన్‌ దొర, అనిల్‌, తెలుగు సినీ, టీవీ కాస్ట్యూమర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి నరసింహారావు, నాగేంద్ర ప్రసాద్‌, వాసు, లలిత, సురేష్‌, రాజేశ్వర్‌ రెడ్డి, బాబ్జీ, రాంబాబు, మూర్తి, ఉపేందర్‌ రెడ్డి తదితరులు ఉన్నారు. 


Updated Date - 2020-06-02T10:12:36+05:30 IST